Friday, May 3, 2024

6 వేల మంది కరోనా రోగులు అదృశ్యం?

- Advertisement -
- Advertisement -

Laborers to own villages with the coronavirus impact

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఆరు వేల మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. నగరంలో దాదాపు 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అధికారులు తెలిపారు. గతంలో 10,835 మంది అదృశ్యం కాగా వారి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. ప్రస్తుతం మళ్లీ 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన వారు తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో పాటు మొబైళ్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. కొందరు కరోనా వైరస్ సోకగానే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ వచ్చిన వారిని కనిపెట్టడం సమస్యగా ఉందని పోలీసులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారు స్థలాలు మారడంతో కరోనా వైరస్ మరికొంతమందికి అంటుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News