Friday, April 26, 2024

తండ్రిని చంపి… కొడుకు పరార్..

- Advertisement -
- Advertisement -

son murders father at nizamabad district

వర్ని: నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ కుమారుడు తండ్రిని కర్రతో కొట్టి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన జిల్లాలోని వర్ని మండలంలోని శ్యామ్ లాల్ తాండాలో చోటుచేసుకుంది. ఇంట్లో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. కోడలిపై కుమారుడు దాడి చేస్తుండగా తండ్రి (మాలోత్ దుష్య) అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన కొడుకు తండ్రి(58)ను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన దుష్య అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడిని వినోద్ గా గుర్తించారు. తండ్రి మృతిచెందడంతో వినోద్ అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

son murders father at nizamabad district

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News