- Advertisement -
హైదరాబాద్: గాంధీ భవన్లో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చీరలు పంపిణీ చేశారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా వేడుకలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దేశం కోసం కుటుంబసభ్యుల ప్రాణాలను పణంగాపెట్టిన కుటుంబం గాంధీలదని ఆయన కొనియాడారు. సోనియాగాంధీ వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణలో ఉన్నామని ఉత్తమ్ అన్నారు. సిఎల్పీ నేత భట్టి, ఎంఎల్ఎ జగ్గారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కీలు పాల్గొన్నారు.
Sonia Gandhi birthday celebrations at Gandhi Bhavan
- Advertisement -