Sunday, April 28, 2024

ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రధానం: సోనియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిడబ్యూసీ తీర్మానాలను అమలు చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం సోనియాగాంధీ అధ్యక్షతన ఏఐసీసీ సమావేశం జరిగింది. దేశంలో కాంగ్రెస్ బలోపైతానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ సభ్యత్వాల నమోదుతోపాటు ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. ”బిజెపి, ఆర్ఎస్ఎస్ సైద్దాంతిక ప్రచారంపై పోరాడాలి. మోడీ సర్కార్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. బిజెపి, ఆర్ఎస్ఎస్ సైద్దాంతిక ప్రచారంపై పోరాడాలి. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రధానం. యువతకు ఓ వేదికను అందజేయాల్సిన బాధ్యత మనదే. నవంబర్ 1వ తేదీ నుంచి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు చేపట్టాలి. ప్రతి గడపకూ వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలి. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నకల్లో గెలుపు కోసం పనిచేయాలి” అని కాంగ్రెస్ నాయకులకు సోనియా గాంధీ సూచించారు.

Sonia Gandhi Chairs AICC Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News