న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నివాళులర్పించారు. సోనియా, ప్రియాంకలు శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారకం శక్తిస్థల్కు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. రాహుల్ ఢిల్లీలో లేనందున ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం రాహుల్ సిమ్లాలో ఉన్నట్టు చెబుతున్నారు. ‘అబద్ధం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుతురుకు, చావు నుంచి జీవితానికి అంటూ జీవిత పరమార్థం చెప్పిన నానమ్మకు కృతజ్ఞతలు’ అని రాహుల్ ట్విట్ చేశారు. తన నానమ్మ వర్ధంతి రోజునే మహర్షి వాల్మీకి జయంతి రోజని ప్రియాంక గుర్తు చేశారు. వాల్మీకి బోధనల్ని నానమ్మ నుంచే తెలుసుకున్నానని ప్రియాంక తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్, అధికార ప్రతినిథి రణదీప్ సూర్జేవాలాసహా పలువురు ఆ పార్టీ నేతలు ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డే కాల్చి చంపడం ఆ రోజుల్లో ఓ సంచలన ఘటన.