Wednesday, May 1, 2024

దేశ్ కా మెంటర్ కు అంబాసిడర్ సోనూసూద్

- Advertisement -
- Advertisement -

ambassador of Desh Ke Mentor program

 

ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను దేశ్ కా మెంటర్ కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. ఇప్పటి నుంచి దేశ్ కా మెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. దేశ్‌కా మెంటర్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులు తమకు ఇష్టమైన కెరీర్‌ను ఎంచుకునే విషయపై సోనూసూద్ మార్గదర్శనం చేయనున్నారు. సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు సిఎం కేజ్రీవాల్ వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో సిఎం కేజ్రీవాల్‌తో సోనూసూద్ సమావేశమయ్యారు. సోనూసూద్‌తో రాజకీయాలపై చర్చ జరపలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News