Tuesday, May 7, 2024

ఇది క్లిష్టమైన టెస్టు మ్యాచ్

- Advertisement -
- Advertisement -
Sourav Ganguly about Coronavirus
Sourav Ganguly

 

సౌరవ్ గంగూలీ

కోల్‌కతా: కరోనాతో జరుగుతున్న పోరును భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన శైలీలో విశ్లేషించాడు. దీన్ని క్లిష్టమైన పిచ్‌పై ఆడుతున్న టెస్టు మ్యాచ్‌గా పరిగణించాడు. ఇందులో విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సిందేనన్నాడు. ప్రస్తుతం ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై టెస్టు మ్యాచ్‌ను ఆడుతున్నామని, ఇందులో ఓటమి పాలవ్వకుండా గట్టెక్కాలంటే తీవ్రంగా పోరాడడం తప్ప మరో మార్గం లేదన్నాడు. కరోనా మహమ్మరి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడం తనను ఎంతో ఆందోళన కలిగిస్తోందన్నాడు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తుండడం కలవర పరిచే అంశమన్నాడు. కరోనాపై సాధ్యమైనంత త్వరగా విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. దేశంలో చాలా చోట్ల కరోనా వల్ల అల్లకల్లోల వాతావరణం నెలకొందని, మహమ్మరిని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడం బాధిస్తుందన్నాడు. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ సహనంతో ఓర్చుకోవాలన్నాడు. మహమ్మరి తగ్గే వరకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని గంగూలీ సూచించాడు.

 

Sourav Ganguly about Coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News