- Advertisement -
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో మరికాసేపట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వీర శైవ జంగమ సంప్రదాయం ప్రకారం ఆయనకు తుది వీడ్కోలు పలుకనున్నారు. ఆయనను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తామరైపాక్కంలో తానెంతో ఇష్టంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్ లో ఆయన ఖననం జరుగనుందని కుటుంబసభ్యులు వెల్లడించారు. కోవిడ్ కారణంగా అధికారులు ఫాంహౌస్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో బాలు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. బాలు పార్థివదేహానికి డైరెక్టర్ భారతీయరాజా, దేవీశ్రీ ప్రసాద్, సింగర్ మనోతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
SP Balasubrahmanyam’s funeral to be held in Chennai
- Advertisement -