Saturday, April 27, 2024

భద్రాచలం సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా భక్తులకు అవకాశం

Srimad Ramayana Parayanam at Bhadrachalam Temple
మనతెలంగాణ/హైదరాబాద్:   శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ కార్పొరేషన్ శివసాయినగర్‌కు చెందిన భక్తులు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఈ తలంబ్రాలను పంపిస్తామని శ్రీలక్ష్మి గణపతి ఆలయ పూజారి కృష్ణారావు పేర్కొన్నారు. భద్రాచలం నుంచి తెప్పించిన వడ్లతో ఈ తలంబ్రాలు తయారు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. ఈ అవకాశం తమకు రావడం అదృష్టమని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News