Friday, April 26, 2024

కుల, చేతి వృత్తులకు కెసిఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Srinivas goud praise to CM KCR

 హుజారాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హుజారాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా హుజారాబాద్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి-విక్రయ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలోని చేనేత ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. చేనేత కార్మికుల తో కలసి నూలు రాట్నాన్ని వడికికి వృత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అందిస్తున్న నూలు సబ్సిడీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో కుల, చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News