Friday, May 3, 2024

వస్త్ర పరిశ్రమకు అండగా నిలవండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభు త్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వా ర్తలపై కెటిఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. గత పది సంవత్సరాల్లో సి రిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్‌లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని పేర్కొన్నారు.

గత పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయని తెలిపారు. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News