- Advertisement -
లక్నో: యుపిలో స్ట్రెయిన్ కరోనా వైరస్ కలవరానికి గురి చేస్తోంది. బ్రిటన్ నుంచి మీరట్కు వచ్చిన రెండేళ్ల బాలికకు స్ట్రెయిన్ కరోనా వైరస్ సోకిందని తెలియగానే స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాలిక తల్లిదండ్రులకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. మీరట్లోని సుభర్తి మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో భారత్ స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 20కి చేరింది. హైదరాబాద్లో ఇద్దరు, పుణే, తమిళానాడులో ఒక్కరు, బెంగళూరు ఏడుగురు, ఢిల్లీలో ఎనిమిది మందికి సోకినట్టు సమాచారం. ప్రస్తుతం భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.02 కోట్లకు చేరుకోగా 1.48 లక్షల మంది మృత్యువాతపడ్డారు.
- Advertisement -