Saturday, May 4, 2024

“స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను అందుకున్న సుధీర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Sudheer Reddy received Spirit of Humanity Award

హైదరాబాద్: “విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ” ద్వారా “స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందుకున్నారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అందజేశారు. కరోనా, లాక్ డౌన్ సమయం,  హైదరాబాద్ నగరంలో గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాల వల్ల వచ్చిన వరదల సమయంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు, అంధులు, వికలాంగులు, అనాథలకు అందించిన అపారమైన సేవలతో పాటు అనేక సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నటువంటి గొప్ప సేవలను గుర్తించిన “విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ” ఎంఎల్ఎ సుధీర్ రెడ్డికి “అంతర్జాతీయ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సిఇఒ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్ రమాకాంత్, ఎం ఆర్ డి సి ఎల్ చైర్మన్ ఒఎస్డి పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్  పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News