Saturday, April 27, 2024

కాంగ్రెస్‌కు బైబై చెప్పిన సునీల్ జాఖర్

- Advertisement -
- Advertisement -

Sunil Jakhar

న్యూఢిల్లీ:  ఫేస్‌బుక్ లైవ్ పోస్ట్‌లో శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ – సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని ‘మంచి వ్యక్తి’ అని ప్రశంసించారు. జాఖర్ – ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాల’పై గత నెలలో పదవుల నుండి తొలగించబడ్డారు – నియంత్రణను తిరిగి పొందాలని గాంధీని పిలిచారు మరియు ‘సైకోఫాంట్ల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవాలి’ అని హెచ్చరించారు. “కాంగ్రెస్ కు గుడ్ లక్, గుడ్ బై” అని జాఖర్  పేర్కొన్నారు.

ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఫలితాలను సమీక్షించేందుకు,  లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున 2024లోపు పార్టీ కోలుకునేలా చేయడం కోసం మూడు రోజుల సీనియర్ నేతల సమావేశం రాజస్థాన్‌లో జరిగింది. ‘చింతన్ శివిర్’ మీట్‌లో కాంగ్రెస్ రెండవ రోజుకి ప్రవేశించిన నేపథ్యంలో జాఖర్ బాంబు ప్రకటన వెలువడింది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో మరియు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలలో  కాంగ్రెస్ తన ఇంటిని చక్కదిద్దడానికి ,  బిజెపిని తీవ్రమైన సవాలుగా ఎదుర్కోడానికి  కాంగ్రెస్ ఏమి చేయాలో ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు నొక్కిచెప్పాయి. తన ఫేస్‌బుక్ లైవ్ పోస్ట్‌లో ఈ 68 ఏళ్ల నాయకుడు కాంగ్రెస్ నాయకులపై ‘ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌లో పార్టీని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. ఆయన రాజ్యసభ ఎంపీ అంబికా సోనీని విమర్శించారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి చన్నీని కూడా విమర్శించారు. అంతేకాక ఆయన హరీశ్ చౌదరీ, హరీశ్ రావత్, తారీఖ్ అన్వర్ లపై కూడా తన అక్కసును వెళ్లగ్రక్కారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News