మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీసులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్,ప్రొటెక్టర్తో కూడిన కిట్ను అందజేశారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు, ప్రొటెక్టర్,గ్లౌస్తో కూడిన కిట్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర సిపి అంజనీకుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా విధులు నిర్వర్తిస్తున్న వారిలో వైద్య సిబ్బంది ముందు ఉన్నారని వారి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పోరాడుతోందని తెలిపారు. పోలీసులను మరింత ప్రోత్సహించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ కిట్లు అందజేస్తున్నారని అన్నారు. పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు పోలీసులకు పంపిణీ చేశారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కరోనా వైరస్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.