Saturday, April 27, 2024

గ్యారంటీ లేని కాంగ్రెస్ నాయకుల ఆరు గ్యారెంటీలకు దిక్కేక్కడా: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని సనత్ నగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ లోని సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జై ప్రకాష్ నగర్, కైలాష్ నగర్‌లలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు ప్రతి ఇంటా మంగళహారతులు పట్టి, ఇండ్ల పై నుండి పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మా సమస్యలు పరిష్కరించి, మాకు అన్ని విధాలుగా అండగా నిలిచిన శ్రీనన్న కే మా ఓటు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తప్పుడు హామీలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు మోసపూరిత, అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేదు కానీ.. వారు చెప్పే గ్యారెంటీ లను ఎవరు నమ్ముతారని ఎద్దెవా చేశారు.

ప్రజలు బిఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నందునఖచ్చితంగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శేఖర్, మాజీ అధ్యక్షుడు ఖలీల్, నాయకులు బాల రాజ్, సరాఫ్ సంతోష్,నోమాన్, సురేష్ గౌడ్, కర్నాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేష్, పుష్పాలత తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News