Sunday, April 28, 2024

టీమిండియా ప్రాక్టీస్ మొదలైంది..

- Advertisement -
- Advertisement -

Team India Begin Training Ahead Of Warm-Up Match

 

డర్హమ్: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా సాధన మొదలు పెట్టింది. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇప్పటికే డర్హమ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. డబ్లూటిసి ఫైనల్ సమరం ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దీంతో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్‌లోని పర్యాటక ప్రదేశాలను చుట్టి వచ్చారు. ఇక విహార యాత్రలు ముగించుకున్న క్రికెటర్లు డర్హమ్ చేరుకున్నారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా కీలక ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌ను షురూ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. మరోవైపు భారత క్రికెటర్లకు ఇప్పటికే కొవిడ్ రెండో దశ వ్యాక్సినేషన్ కూడా పూర్తయ్యింది. దీంతో ఎలాంటి ఆందోళన లేకుండా టీమిండియా ఆటగాళ్లు సిరీస్‌పై దృష్టి సారించారు. వచ్చే నెలలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుంది. దీని కోసం భారత క్రికెటర్లు ఇప్పటినే నుంచే కఠోర సాధన ఆరంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News