Saturday, April 27, 2024

దయచేసి ఇది అసత్యమని చెప్పండి

- Advertisement -
- Advertisement -

team-india-cricketers-condoles-to-sushants-death

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో ధోనీ పాత్రలో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌తో పాటుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాలుగా పలువురు మాజీ, నేటి క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలీవుడ్ ఓ ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని సచిన్ తెండూల్కర్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు.‘ ఈ వార్తతో షాక్‌కు గురయ్యా. సుశాంత్ లేడని తెలిసాక ఎంతో బాధపడ్డా. అతడు ఎంతో ప్రతిభావంతుడైన యువ నటుడు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలియజేస్తున్నా. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని సచిన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా సుశాంత్ తనను షాక్‌కు గురి చేసిందని విరాట్ కోహ్లీ అన్నాడు.

అతడి మరణాన్ని జీర్ణించుకోవడం ఎంతో కష్టమని అంటూ, అతడి ఆత్మకు శాంతి చేకూరాలని, అతడి బంధువులు, కుటుంబ సభ్యులకు దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని అన్నాడు. కాగా మహీ బయోపిక్ కోసం సుశాంత్ తమతో ఎంతో సమయం గడిపాడని సురేశ్ రైనా అంటూ, మనం ఓ అందమైన నటుడ్ని కోల్పోయామన్నాడు. దయచేసి ఇది అసత్యమని చెప్పండని హర్భజన్ సింగ్ అంటూ, సుశాంత్ ఇక లేడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నాడు. యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెవాగ్, పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తదితరులు కూడా సుశాంత్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News