Monday, April 29, 2024

లండన్‌లో టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Team India Hoists National Flag ahead of Day 4 of Lord's Test

 

లండన్: ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్‌లో ఉన్న టీమిండియా జెండా పండుగను అక్కడే జరుపుకొన్నది. తాము బస చేసిన హోటల్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం టీమ్‌మేట్లతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో పాటు ఇతర సిబ్బంది కూడా పాలొన్నారు. అనంతరం అక్కడినుంచే లార్డ్ మైదానానికి బయలుదేరి వెళ్లారు. ఈ వీడియోను బిసిసిఐ అభిమానులతో పంచుకొంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గత వారం ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లిన బ్యాట్మ్‌న్ పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ కూడా కనిపించారు. వీరు తమ హోమ్ ఐసొలేషన్ పీరియడ్‌ను ముగించుకొని ఈ నెల 25నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు సెలెక్షన్ కోసం అందుబాటులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News