Saturday, April 27, 2024

రాహుల్ ఔట్… టీమిండియా 309/5

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 76 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 309 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెల్ రాహాల్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. రాహుల్ 86 పరుగులు చేసి టామ్ హార్ట్ లే బౌలింగ్ లో రెహాన్ అహ్మాద్ కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ రూపంలో ఔటయ్యాడు. భారత బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్ (80), శ్రేయస్ అయ్యర్(35), రోహిత్ శర్మ(24), శుభ్‌మన్ గిల్(23) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో  రవీంద్ర జడేజా(45), శ్రీకర్ భరత్(09) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్‌లే రెండు వికెట్లు తీయగా జాక్ లీచ్, రెహాన్ అహ్మాద్, జోయ్ రూట్ తలో ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News