Friday, April 26, 2024

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 51 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఐదు వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాలో పడింది. ఆస్ట్రేలియా బౌలర్ల బంతులు బుల్లెట్ల దూసుకొస్తున్నాయి. ఎవరు క్రీజులో ఉండి పది పరుగులు చేయడం గగనమైపోయింది. స్టార్క్ నిప్పులు చెరిగే బంతులు విసరడంతో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, సూర్యాకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ తోకముడిచారు. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగారు. రోహిత్ శర్మ 13 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(22), రవీంద్ర జడేజా(2) బ్యాటింగ్ చేస్తున్నారు. మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా సీన్ అబాట్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News