Monday, April 29, 2024

టీమిండియా సాధన షురూ..

- Advertisement -
- Advertisement -

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమిండియా ఆదివారం సాధన ప్రారంభించింది. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం భారత క్రికెటర్లు మైదానంలో దిగారు. ఈ నెల 18 నుంచి కివీస్‌తో డబ్లూటిసి ఫైనల్ పోరు జరుగనుంది. ఈ సమరం కోసం భారత క్రికెటర్లు సాధనను ఆరంభించారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల పర్యవేక్షణలో భారత క్రికెటర్లు చాలా సేపు సాధన చేశారు. హైదరాబాది క్రికెటర్ మహ్మద్ సిరాజ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ క్రికెటర్లు అశ్విన్, పుజారా తదితరులు చాలా సేపు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. కీలకమైన ఫైనల్ సమరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లందరూ ఫిట్‌నెస్ మెరుగు పరుచు కోవడంపై దృష్టి సారించారు.

Team India started practice after 3 days quarantine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News