Tuesday, April 30, 2024

సఫారీలపై గెలిచిన భారత్

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీమిండియా 113 పరుగులతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు సఫారీలు 191 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 113 పరుగుల తేడాతో టీమిండియా విజయభేరీ మోగించింది. భారత్ బౌలర్లలో బుమ్రా, షమీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. సఫారీ బ్యాట్స్‌మెన్లలో ఎల్గర్ (77), బవుమా(35) నాటౌట్, క్వింటన్ డికాక్ (21), పెటర్సన్ (17), మార్కో జెన్సన్ (13), డస్సెన్ (11), కేశవ్ మహారాజ్ (8), మర్కమ్ (1), మల్డర్ (01) పరుగులు చేసి ఔటయ్యారు. రబడా, ఎంగిడి పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో మైదానం వీడారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 327
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్:197
ఇండియా రెండో ఇన్నింగ్స్: 174
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 191

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News