- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగిన తరువాత అర గంట పాటు జీరో అవర్ చేపట్టనున్నారు. శాసనసభలో సభ్యులు విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై చర్చలు జరుపనున్నారు.
- Advertisement -