- Advertisement -
హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గం సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆర్టీసీ బస్సులకు అనుమతితోపాటు రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటసాగు విధివిధానాలపై చర్చించే అవకాశాలున్నాయి.
Telangana Cabinet meeting chaired by CM KCR
- Advertisement -