Monday, April 29, 2024

అఫ్ఘనిస్తాన్ లో కారు బాంబు దాడి.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 Car Bomb Attack

 

కాబూల్: అఫ్ఘనిస్తాన్ లో కారు బాంబు దాడి జరిగింది. ఘంజి సిటీలో జ‌రిగిన కారు బాంబు దాడిలో ఐదుగురు మృతి చెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఈ దాడిని ధృవీకరించింది. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ నేష‌న‌ల్ డైర‌క్ట‌రేట్ సెక్యూరిటీ యూనిట్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడికి పాల్ప‌డ్డట్టు గవర్నర్ తెలిపారు. బాధితులంతా ఇంటెలిజెన్స్ సెక్యురిటీ విభాగానికి చెందిన ఉద్యోగులేనని తేలింది. అయితే, దాడికి బాధ్య‌త వ‌హిస్తూ ఎవ‌రూ ప్ర‌క‌ట‌న చేయనప్పటికీ తాలిబన్లే ఈ హింసాత్మక ఘటనకు పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు. తాలిబ‌న్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతుండగానే ఈ దాడి జరగడం సంచలనం రేపుతోంది.

5 Killed after Car Bomb Attack in Afghanistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News