Monday, April 29, 2024

ఖైరతాబాద్ లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Man Died in Road Accident

 

హైదరాబాద్: నగరంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో భారీగా వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Man Died in Road Accident at Khairatabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News