- Advertisement -
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ సమయంలో ఫుడ్ డెలివరీలపై నిషేదం ఉండటంతో స్విగ్గీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సుమారు 1100 మంది ఉద్యోగులను కొన్ని రోజుల పాటు దూరంగా పెట్టనున్నట్లు పేర్కొన్నది. ప్రమాదకరంగా మారిన వ్యాపారాలను మూసివేసేందుకు స్విగ్గీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్విగ్గీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం పట్ల సిఈవో శ్రీహర్ష స్పందించారు. స్విగ్గీకి ఇది చీకటి రోజు అన్నారు. రానున్న కొన్ని రోజుల్లో వివిధ హోదాల్లో ఉన్న 1100 మందిని తొలగించినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -