- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడుతోంది. గత 24 గంటల్లో 862 మందికి కరోనా వైరస్ సోకగా ముగ్గురు మృత్యువాతపడ్డారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య2.67 లక్షలకు చేరుకోగా 1444 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వ్యాధి నుంచి కోలుకొని ఇండ్లలోకి పోయిన వారి సంఖ్య 2.54 లక్షలకు చేరుకోగా పది వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 164 కేసులు నమోదయ్యాయి.
- Advertisement -