Saturday, April 27, 2024

తెలంగాణకు దైవం కెసిఆర్: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు దైవం కెసిఆర్ అని, చైనాలో కూడా సాధ్యంకానీ రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేసిన నేత సిఎం కెసిఆర్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ తల్లిని గుర్తించని వారికి తెలంగాణ తల్లితో ఏం పని మండిపడ్డారు. తెలంగాణ తల్లికి ప్లీనరీ వేధికిగా కెసిఆర్ దండ వేశారని, పేదలకు అన్నం పెట్టే పార్టీ టిఆర్ఎస్ పార్టీ కావడంతో కాంగ్రెస్, బిజెపి నేతలకు కడుపుమంటగా మారిందన్నారు. టిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని, అదే మా పనితీరుకు నిదర్శనమన్నారు.

బహిరంగ చర్చతో కాదు ఎన్నికతో తేల్చుకోవడమే రాజకేయ పార్టీలకు ముఖ్యమని, హుజురాబాద్ కచ్చితంగా గెలుస్తామని, అక్కడ రైతుబంధు రావడం లేదా పెన్షన్లు అందడం లేదా? అని అడిగారు. అన్ని వర్గాలకు రాష్ట్రమంతటా మేలు చేశామని, హుజురాబాద్ లోనూ మేలు చేయడంతో టిఆర్ఎస్ గెలుస్తుందన్నారు. 24 గంటల కరెంటు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్ల పెంపు అబద్దమా అని శ్రీనివాస్ గౌడ్ అడిగారు. జర్నలిస్టులు, న్యాయవాదులకు సంక్షేమ నిధి ఏర్పాటు అబద్దమా?, ఏది అబద్ధం, ప్లీనరీలో అబద్దాలు ఎందుకు మాట్లాడుతామన్నారు.  ఉద్యోగ నియమాకాలపై త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఏడేళ్లలోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? అని అడిగారు. తెలంగాణ లో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే మళ్లీ అక్కడ వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ముందు ఇక్కడి ఆ పార్టీ నేతలు ఆ పని చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News