Monday, April 29, 2024

5,348 వైద్యారోగ్య శాఖలో పోస్టులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వై ద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని 5,348 పో స్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. ఈ మే రకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రజారో గ్యం, ఆయుష్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఐపి ఎం, డిఎంఇ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్‌జె క్యా న్సర్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల ను భర్తీ చే సేందుకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇ చ్చింది. ఈ నియామకాలను వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా చేపట్టనున్నారు. ఇందుకో సం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పా యింట్లు, అర్హతకు సంబంధించిన వివరాలను ఆ యా విభాగాల అధిపతు ల నుంచి తీసుకోవాలని చెప్పారు. వివరాల ఆ ధారంగా నోటిఫికేషన్ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News