మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్3కు శనివారం తెరలేవనుంది. హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్డేడియం వేదికగా ఫిబ్రవరి 22 నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. 14 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో 32 మ్యాచ్లు నిర్వహిస్తారు. మార్చి 13న సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ సమరం మార్చి 14న జరుగనుంది. కాగా, ఈ పోటీలను స్టార్ స్పోర్ట్ 1(తెలుగు) ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
కాగా టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను లీగ్ కమిషనర్ సంజయ్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో కబడ్డీ లీగ్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈసారి కూడా లీగ్ను జయప్రదంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఈ లీగ్లో తెలంగాణ వ్యాప్తంగా 8 జట్లు పోటీ పడుతున్నట్టు ఆయన వివరించారు.
Telangana Premier Kabaddi League Start from Feb 22