Monday, April 29, 2024

‘బహిరంగ’ విజయం

- Advertisement -
- Advertisement -

Telangana ranks first among states without open defecation

బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్టాల్లో తెలంగాణకు ప్రథమస్థానం

దేశంలో 17684 ఒడిఎఫ్ గ్రామాలు
అందులో 6537 తెలంగాణవే
తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక
తెలంగాణపై కేంద్రప్రభుత్వం ప్రశంసల జల్లు
నిరంతర పారిశుధ్య పనుల వల్లే ఈ ఘనత సాధ్యమైంది, సిబ్బందికి అభినందనలు
కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

మనతెలంగాణ/హైదరాబాద్ :బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత సమాజ నిర్మాణంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ప్రధమస్థానంలో నిలిచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని కేంద్ర ప్రభుత్వం అభినందనలు తెలిపింది, ఈ క్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నాడు విడుదల చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు స్వచ్ఛ గ్రామాల్లో 1/3 వ వంతు గ్రామాలలో తెలంగాణ రాష్ట్రమే వొడిఎఫ్‌లను పూర్తి చేసిందని తెలిపారు. అలాగే దేశంలో 17,684 వొడిఎఫ్ గ్రామాలు వుండగా అందులో 6,537 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో వున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో వుండగా తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 2,3,4 స్థానాలను కలిగి వున్నాయి.

ఇదిలావుండగా రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సిఎం కెసిఆర్ చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ది పనులు చేపడుతూనే నిరంతరం పారిశుధ్య పనులు చేయడం వల్లే ఇలాంటి అభినందనలు వస్తున్నాయి అన్నారు. స్వచ్చ రాష్ట్ర, భారత నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు అభినందనలు, కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తూ అనేక అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుందని, ఇప్పటికే రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు గెలుచుకుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News