Tuesday, May 7, 2024

తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యశాఖ అధికారి వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరు బాధితులకు  చికిత్స అందించేందుకు గచ్చిబౌలి టిమ్స్ ఆస్పట్రిలో చేర్చారు. అయితే, ఇద్దరు బాధితులు ఈరోజు తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు బాధితులు కెన్యా, సోమాలియా నుంచి వచ్చారు. బాధితుల కుటుంబ సభ్యలును అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కోల్ కతాకు వెళ్లిన మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకింది. గత నెల రోజులుగా దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. తాజా కేసులతో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 40కి చేరుకుంది.

Telangana Reports 2 Omicron Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News