Friday, April 26, 2024

ఫిబ్రవరి 17న తెలంగాణ సెక్రెటరియేట్ ఆవిష్కరణకు రాబోతున్న ప్రముఖులు

- Advertisement -
- Advertisement -
ఆవిష్కరణానంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రెటరియేట్ బిల్డింగ్‌ను మధ్యాహ్నం 11.30 12.30 గంటల మధ్య ఆవిష్కరించనున్నారు. అయితే ఆవిష్కరణకు ముందు వేద పండితుతు వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం, ఇతర క్రతువులు చేపట్టనున్నారు.

తెలంగాణ సచివాలయ ఆవిష్కరణకు తమిళనాడు ముఖ్యమంత్రి , డిఎంకె అధ్యక్షుడు ఎంకె. స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరఫున జెడి(యు) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్. అంబేద్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేద్కర్ , తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. నూతన సచివాలయం ఆవిష్కరణానంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సమావేశం జరుగునుంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏడంతస్తుల నూతన సెక్రెటరియేట్ భవనం హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద ఉంది. దాదాపు పూర్తి కావొస్తున్న దశకు చేరింది. 7 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెక్రెటరియేట్‌ను నిర్మించారు. అన్ని ఆధునిక వసతులతో దీనిని నిర్మించారు. దీనికి రూ. 600 కోట్లు ఖర్చయింది. భవన నిర్మాణం పనులు 2020 డిసెంబర్‌లో ఆరంభమై రెండేళ్లలో పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News