- Advertisement -
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో గురువారం మధాహ్నం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులలో ఒక తీవ్రవాది హతమయ్యాడు. వానిగమ్ పాయిన్ క్రీరీ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలను చూడగానే తీవ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో తీవ్రవాది చనిపోయాడు. ఘటనా స్థలంలో ఎకె 47 తుపాకీ, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -