Monday, April 29, 2024

దర్భంగా కేసులో కొత్తకోణాలు..

- Advertisement -
- Advertisement -

దర్భంగా కేసులో కొత్తకోణాలు
ఎన్‌ఐఎ కస్టడీలో నిందితులు
‘రా’ ఎజెంట్ అంటూ నమ్మబలికిన మాలిక్ బద్రర్స్
మనతెలంగాణ/హైదరాబాద్: దర్భంగా పార్సిల్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలతో పాటు కోత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లకు వ్యూహరచన చేసింది లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్బాల్ అయినప్పటికీ, దీనిని అమలు చేయడంలో కర్మ, క్రియ అంతా మాలిక్ సోదరులేనని ఎన్‌ఐఎ విచారణలో తేలింది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన ఇమ్రాన్ మాలిక్ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ అంటూ కుటుంబసభ్యులను నమ్మించాడు. అంతేకాదు తాను రాలో కీలక హోదాలో ఉన్న మహిళ అధికారి దగ్గర పనిచేస్తున్నట్లు అందర్నీ నమ్మించాడు. ఈక్రమంలో మాలిక్ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తమ కుమారుడు రాలో పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు నమ్మారు. కాగా దర్భంగా పేలుళ్ల కేసులో ఇమ్రాన్ మాలిక్ అరెస్ట్ కావడంతో అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దర్భంగా కేసులో మాలిక్ బ్రదర్స్ అరెస్ట్ అయిన మాలిక్ సోదరుల తండ్రి ముసాఖాన్ మాజీ సైనికుడు కావటంతో తన కుమారులకు కూడా దేశభక్తి ఉంటుంది అనే భ్రమ లో తమ కుమారులు చెప్పింది నమ్మాడు మాజీ సైనికుడు మూసాఖాన్. తమ కుమారుడు అరెస్ట్ అయిన విషయం తెలియగానే తన కుమారులు రా కోసం పని చేస్తున్నారు అని మూసాఖాన్ బహిర్గతం చేశాడు. ‘రా’లో పనిచేసే ఒక సీనియర్ అధికారి తమకు టాస్క్ ఇచ్చిందని అందుకోసమే 2012లో పాకిస్తాన్ వెళ్లామని మాలిక్ సోదరులు ఇంట్లో నమ్మించారు. 2012లో పాకిస్తాన్ కి వెళ్ళిన నాసిర్ మాలిక్, పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ చేత బాంబు తయారీ లో కఠోరమైన శిక్షణ తీసుకున్నాడు. 2016 లోనూ ఇప్పుడు అరెస్టయిన నలుగురు ఉగ్రవాదులు దుబాయ్ వేదికగా ఒక హోటల్లో రూమ్ తీసుకుని కలుసుకున్నారు.
పాక్, అప్ఘన్ సరిహద్దుల్లో శిక్షణ:
నగరానికి చెందిన మాలిక్ బ్రదర్స్ 2012లో పనిమీద పాక్ వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి పాక్-,ఆప్ఘన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల దగ్గర ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు ఎన్‌ఐఎ విచారణలో తేలింది. దాదాపు 4 నెలల పాటు పాకిస్తాన్‌లో మాలిక్ బ్రదర్స్ ట్రైనింగ్ తీసుకుని అటు నుంచి 2016లోనూ దుబాయ్ వెళ్లారు. దుబాయ్‌లో ఐఇడి అమర్చడంలో నాసిర్ మాలిక్ మాస్టర్ మైండ్ అని తేలింది. బ్లాస్ట్‌కు ముందు మాలిక్ బ్రదర్స్ కదలికలపై ఎన్‌ఐఎ విచారణ జరుపుతోంది. కాగా ఈ కేసులోని కీలక నిందితులు మాలిక్‌బ్రదర్స్‌ను విచారించేందుకు ఢిల్లీ ఎన్‌ఐఏ అధికారులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు.
నిందితులపై ఎన్‌ఎఐ ప్రశ్నల వర్షం:
దర్భంగా రైలులో బాంబు పెట్టాలని ఆదేశించింది ఎవరు..? బాంబు తయారీ శిక్షణ ఎక్కడ.. ఎలా పొందారు..? అనే విషయాలను మాలిక్ సోదరులను ఎన్‌ఐఏ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు అంగుళాల చిన్న సీసాలో శక్తివంతమైన బాంబు తయారీ ఎలా సాధ్యమైంది..? అందులో కలిపిన రసాయనాలు ఏమిటీ అన్న విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. బాంబు తయారీలో హాజీ సలీం, ఇక్బాల్ ఖాన్ పాత్రలపై కూడా ఆరా తీశారు. పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాలో కీలక బాధ్యతలు వహిస్తున్న ఇక్బాల్ ఖాన్‌తో సంప్రదింపులు ఎలా జరిగాయి? అతనితో మాట్లాడినప్పుడు వాడిన భాష, కోడ్ గురించి ప్రశ్నిం చారు. కోడ్‌లో మాట్లాడటంతో పాటు యూట్యూబ్ నుంచే బాంబుల తయారీ శిక్షణ పొంది ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చీరెల మధ్యలో టానిక్ బాటిల్ అమర్చి అందులో కెమికల్ ను మిక్స్ చేసి పేలుడు సంభవించెలా చేయడం తోపాటు, దానికి ముందు మాలిక్ సోదరుల కార్యకలాపాలపై విచారించనుంది జాతీయ దర్యాప్తు సంస్థ. అంతేకాదు, సరదు కెమికల్ ను పార్సిల్ లో పెట్టి సరిగ్గా ఇరవై గంటలకు పేలేలా ఆ బాటిల్ తో పాటు ఐఇడి అమర్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఎన్‌ఐఎ కస్టడీలో నిందితులు: దర్భంగ పేలుళ్ల కేసులో నిందితులను ఎన్.ఐ.ఎ కస్టడీలోక తీసుకుని విచారణ చేపడుతోంది. జూన్ 17న బీహార్ రాష్ట్రంలోని దర్భంగ రైల్వే స్టేషన్ లో పేలిన పార్సల్ కు సంబంధించి జూన్ 30న హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన ఇమ్రాన్ మాలిక్, నజీర్ మాలిక్ అనే ఇద్దరు యువకులను ఎన్‌ఐఎ అరెస్ట్ చేసింది. కాగా జూన్ 15న ఉబర్ క్యాబ్‌లో సికింద్రాబాద్ స్టేషన్ కు మల్లేపల్లి నుండి ఒక పార్సెల్ ను పంపించారు ఇద్దరు సోదరులు. జూన్ 17న దర్భంగ స్టేషన్ ప్లాట్‌ఫాం నెంబర్ 2 వద్దకి చేరుకున్న తర్వాత, సదరు పార్సిల్‌ను కిందికి దింపే క్రమంలో పేలుడు సంభవించింది. మొదట సాధారణ ప్రమాదంగా దీన్ని పరిగణించినా.. తర్వాత విచారణలో దీని వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ధృవీకరించారు. ఇందులో భాగంగా పార్సెల్ పంపిన ఇమ్రాన్ ను హైదరాబాద్ మల్లేపల్లి లోని వారి నివాసంలో జూన్ 30న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన హాజీ సలీం, కాఫీ ల్ అనే ఇద్దరు తండ్రి కొడుకులను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. ఇక, తాజాగా మాలిక్ బ్రదర్స్ కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కు కోర్టు అనుమతించడంతో ఇద్దరు మాలిక్ సోదరులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
మాలిక్ బ్రదర్స్ సన్నిహితులపై నిఘా:
హైదరాబాదులో మాలిక్ సోదరులకు సహకరించిన సన్నిహితులు, అనుచరులపై ఎన్.ఐ.ఎ దృష్టి సారించింది. ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడే నివాసం ఏర్పరచుకొని కచ్చితంగా ఇస్లాం వైపు పలువురు యువకులను ఆకర్షితులను చేసి ఉంటారని అభిప్రాయపడుతోంది. అటువంటి సానుభూతిపరుల పాత్ర పైనా ఎన్‌ఐఎ విచారించనుంది. ముందు ముందు ఈ కేసులో మరిన్ని అరెస్టులు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Terrorist nasir made family believe work as Raw Agent

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News