Tuesday, April 30, 2024

ప్రశాంతంగా ముగిసిన ఫిట్టర్ ట్రైనీ పోస్టుల ఇంటర్నల్ రాత పరీక్ష

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న 114 ఫిట్టర్ ట్రైనీ కేటగిరి 1 పోస్టులను ఇంటర్నల్ అభ్యర్ధులతో భర్తీ చేసేందుకు ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించినట్లు జీఎం పర్సనల్ వెల్ఫేర్ కె.బసవయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షకు 80 మంది అభ్యర్ధులకు హాల్‌టికెట్లు జారీ చేయగా 70 మంది అభ్యర్థులు వ్రాత పరీక్షకు హాజరయ్యారని చెప్పారు.

ఈ పరీక్ష నిర్వహణ పూర్తిగా కంప్యూటర్ ద్వారా నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, సెక్యురిటీ, విజిలెన్స్, సిసి కెమెరాల నిఘా మధ్య నిర్వహించడం జరిగిందన్నారు. తొలుత అభ్యర్థుల కంపెనీ ఐడెంటి కార్డ్, ఆధార్ కార్డులోని వివరాలను పరిశీలించి, మెటల్ డిటెక్టర్‌లతో తనిఖీ చేసిన తరువాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించినట్లు తెలిపారు. ఈ పరీక్షా హాల్‌ను బసవయ్య, జీఎం విజిలెన్స్ కె. ప్రసాదరావులు పర్యవేక్షించారు.ఈ వ్రాత పరీక్ష ఫలితాలను సింగరేణి వెబ్‌సైట్ www.scclmines.comలో, సాయంత్రం హెడ్ ఆఫీస్ మేయిన్ గేట్ నోటీస్ బోర్టులో వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఎవరైనా దళారులు అభ్యర్ధులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లైతే వెంటనే వాటి ఆధారాలతో కూడిన సమాచారాన్ని చీఫ్ విజిలెన్స్ అధికారికి,డైరెక్టర్ పా, విజిలెన్స్ అధికారులు, కంపెనీ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లైతే వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిక్షా నిర్వహణ పరిశీలనలో డిజిఎం పర్సనల్ ధన్‌పాల్ శ్రీనివాస్, వేణుగోపాల్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శారద, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్సెన్, డివైపిఎం నాగేశ్వరరావు సీనియర్ పివో సంతోష్‌కుమార్, ఇతర అధికారులు, ఆర్‌సి విజిలెన్స్, సెక్యురిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News