Saturday, May 4, 2024

సిఐఆర్‌ఐతో బాధితుడికి ఫోన్ అప్పగింత

- Advertisement -
- Advertisement -

చేర్యాల: చేర్యాల పట్టణానికి చెందిన బసవరాజు వెంకటేశ్ అనే వ్యక్తి తన విఓ ఫోన్‌ను 14న పొగొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in వెబ్ సైబ్‌లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్‌ను ఎంటర్ చేసి బ్లాక్ చేశారు. వెంటనే ఫోన్ దోరికిన వ్యక్తి దానిలో సిమ్‌కార్డును వేసుకోవడంతో ఈ వెబ్‌సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం చేర్యాల పోలీసులకు చేరడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకొని పొగొట్టుకున్న వ్యక్తికి చేర్యా లపోలీస్ స్టేషన్‌లో సిఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్ కోల్పోయిన వారు వెంటనే ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ ద్వారా పొగొట్టుకున్న ఫోన్‌ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్‌ను తిరిగి తొందరగా పొందుతారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News