Sunday, May 12, 2024

నిబంధనలకు అనుగుణంగానే ఆ భూమిని కొనుగోలు చేశా: మాజీ సిఎస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  భూమి కొనుగోలు విషయమై మాజీ సిఎస్ సోమేష్‌కుమార్‌ను వివరణ కోరగా నిబంధనలకు అనుగుణంగానే ఆ భూమిని కొనుగోలు చేశానని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో తాను ప్రభుత్వ నిబంధనలను అనుసరించే 2018 సంవత్సరం ప్రారంభంలోనే వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రశాసన్ నగర్‌లో అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి కొత్తపల్లిలో ఆరు సంవత్సరాల క్రితమే ఈ వ్యవసాయ భూమి కొనుగోలు చేశానని ఆయన తెలిపారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను అనుసరించి ఈ భూమి కొనుగోలుకు సంబంధించి, ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. భూమి కొనుగోలుకు అనుమతిస్తూ ప్రభుత్వం కూడా తనకు లేఖ ద్వారా అనుమతిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా తాను, ఉన్నత స్థాయి అధికారిగా తన భార్య సుదీర్ఘకాలం ఉన్నతస్థాయి ఉద్యోగంలో ఉన్నామని సోమేశ్ కుమార్ తెలియచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News