Saturday, May 4, 2024

అమెరికాలో పట్టాలు తప్పిన రైలు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

US rail derailed
చికాగో: అమెరికాలో శనివారం ఆమ్ట్రాక్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం ముగ్గురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఆ  రైలు ఆపరేటర్ ఆమ్ట్రాక్ తెలిపారు. ఉత్తర మోంటానాలో 141 మంది ప్రయాణికులు, 16 మంది చోదకులతో చికాగో నుంచి సియాటెల్‌కు వెళుతున్న ఆ రైలు సాయంత్రం సుమారు 4.00 గంటలకు(22.00 గ్రీన్‌విచ్ టైమ్) జోప్లిన్ వద్ద పట్టాలు తప్పింది.  ఉత్తర హెలెనాకు 241కిమీ. దూరంలో, కెనడా బార్డర్ కు 48కిమీ. దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఘటనలో ముగ్గురు చనిపోయారన్న విషయాన్ని లిబర్టీ కౌంటి షరీఫ్ శాఖ కూడా ధ్రువీకరించింది. అసలు ఈ ప్రమాదం ఎందువల్ల జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News