- Advertisement -
నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి
కోర్బ: ఛత్తీస్గఢ్ కోర్బ జిల్లాలలో గత నాలుగు రోజులుగా జరిగిన వేర్వేరు ఏనుగుల దాడి ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గురువారం తెల్లవారుజామున పసాన్ అటవీ ప్రాంతంలోని ఘఘ్ర గ్రామంలో జరిగిన తాజా సంఘటనలో ఏనుగు దాడిలో బుధ్మనియాబాయి అనే 50 ఏళ్ల మహిళ మరణించిందని అటవీ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా బడ్గావ్ గ్రామంలో జరిగిన మరో సంఘటనలో బంధనో బాయి అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఏనుగు దాడిలో మరణించినట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 7న బిర్ర గ్రామంలో ఘసిరామ్ గోండ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు ఏనుగు దాడిలో మరణించాడని ఆయన చెప్పారు.
Three killed in elephant attacks in Korba district
- Advertisement -