Saturday, April 27, 2024

మరో మూడు పట్టణాలకు కేంద్రం అవార్డులు

- Advertisement -
- Advertisement -

ఫీర్జాదిగూడ, కోరుట్ల,
అలంపూర్‌లకు దక్కిన గుర్తింపు
రెండురోజుల క్రితం వచ్చిన
16 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులతో
కలిపి మొత్తంగా 19
పట్టణాలకు అవార్డులు
అవార్డులు గెలుచుకున్న
పురపాలికలకు మంత్రి
కెటిఆర్ అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు అవార్డులు దక్కాయి. మంగళవారం తాజాగా కేంద్రం ప్రకటించిన మూడు అవార్డులతో కలిపి మొత్తం 19 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్‌ఎల్) పోటీల్లో భాగంగా రాష్ట్రంలోని మూడు పట్టణాలు ఫీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు ఈ అవార్డులకు ఎంపికయినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా, సిడిఎంఏ ఎన్.సత్యనారాయణకు మంగళవారం సమాచారం అం దించారు. ఈ నెల 17వ తేదీన ఇండియన్ స్వ చ్ఛత లీగ్ పోటీని నిర్వహించగా, ఈ పోటీల్లో ఈ పట్టణాలను ఎంపిక చేశారు.

దేశంలోని 1,850 పట్టణాలు ఈ పోటీల్లో పాల్గొనగా వీటిలో రాష్ట్రానికి చెందిన మూడు పట్టణాలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. ఇప్పటికే దక్కిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులతో కలిపి రాష్ట్రానికి మొత్తం 19 అవార్డులు దక్కడం విశేషం. 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో అలంపూర్ పట్టణ స్థానిక సంస్థ ఎంపిక కాగా, 25 వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల పట్టణాలు ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈనెల 30న ఢిల్లీలో టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు.

ప్రజల్లో చైతన్యం, అవగాహన

ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీల్లో భాగంగా, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు బృందాలను మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడంతో పాటు వీటికి కెప్టెన్లను నియమించారు. ఇందులో ప్రజలు పాల్గొనేలా వారితో రిజిస్ట్రేషన్లు చేయించారు. వారిలో చైతన్యం, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పురపాలక శాఖ సమర్పించింది. ఈ కార్యక్రమాన్ని అంచనా వేయడంలో భాగంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, ఎన్ని ఈవెంట్లు నిర్వహించారు, ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా జరిగిన కార్యక్రమాల ద్వారా అసెస్మెంట్ ఎలా చేశారన్న విషయాలను కేంద్రం పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇండియన్ స్వచ్ఛత లీగ్‌లో తాజాగా అవార్డు పొందిన ఈ మూడు పురపాలికలకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News