Thursday, May 16, 2024

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

- Advertisement -
- Advertisement -

Flood water

చెన్నై: ఇంకా నిల్వ చేసుకునేందుకు చోటు లేనందున జూలై 1 నుంచి కృష్ణ నీటి సరఫరాను ఆపేయాలని తమిళనాడు నీటి వనరుల శాఖ (వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసింది. తమిళనాడు చెన్నైనగరానికి చెందిన రెండు రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయినందున జూలై 1 నుంచి సరఫరాను ఆపేయాల్సిందిగా కోరింది. కందలేరు రిజర్వాయరు నుంచి  తమిళనాడుకు నీటి సరఫరాను నిలిపేయాల్సిందిగా వినతి చేసింది. ఆంధ్రప్రదేశ్ కందలేరు రిజర్వాయరు నుంచి 2.1 టిఎంసిఎఫ్ టి మేరకు నీళ్లందయాని తమిళనాడు అధికారులు తెలిపారు. అతి తక్కువ సమయంలొోనే తమిళనాడుక సరిపడేంత నీరు అందడం వల్ల తమిళనాడు ప్రభుత్వం నీటి పంపిణీని ఆపేయమని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News