Sunday, May 5, 2024

మణికొండలో టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మణికొండ పురపాలక సంఘం ఫరిధిలో పనిచేసే టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మంగళ వారం ఉత్తర్వులను జారీ చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో 12 అనధికార నిర్మాణాలను, అదనపు అంతస్తుల నిర్మాణాన్ని అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించినందుకు టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ కు జిల్లా కలెక్టర్ షోకాజు నోటీసు జారీ చేయడం జరిగింది. అందుకు సంతోష్ సింగ్ ఇచ్చిన సమాధానం సంతృప్తి కరంగా లేనందున, విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి వహించినందున సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News