Tuesday, April 30, 2024

రాజేంద్రనగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions in Rajendra Nagar
ఆదేశాలు జారీ చేసిన డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్

మనతెలంగాణ, సిటిబ్యూరోః రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్, శివరాంపల్లి రైల్వే లైన్ నిర్మాణ పనులు నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ ఏప్రిల్,2022 వరకు జరగనున్నాయి. దీంతో పోలీసులు వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వట్టేపల్లి, మెహమూదా హోటల్, నుంచి మెహిఫిల్ హోటల్, మైలార్‌దేవ్‌పల్లి జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. క్రింది రూట్లలో వాహనదారులు వెళ్లాలని కోరారు. ట్రాఫిక్ ఆంక్షలకు వాహనదారులు సహకరించాలని పోలీసులు తెలిపారు.

మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ క్రాస్ రోడ్డు, శాస్త్రీపురం మేయిన్ రోడ్డు, వట్టేపల్లి రోడ్డు. వట్టేపల్లి రోడ్డు, శాస్త్రీపురం రోడ్డు, శివరాంపల్లి రైల్వే రోడ్డు, మైలార్‌దేవ్‌పల్లి. వట్టేపల్లి రోడ్డు, ఇంజిన్ బౌలి క్రాస్ రోడ్డు, ఫలక్‌నూమా రోడ్డు, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి.
మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ క్రాస్ రోడ్డు, శాస్త్రీపురం మేయిన్ రోడ్డు, తాడ్‌బండ్ జంక్షన్, కాలాపత్తర్ రోడ్డు, శంషీర్ గంజ్ జంక్షన్, ఇంజిన్ బౌలి క్రాస్ రోడ్డు, వట్టేపల్లి రోడ్డు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News