Monday, May 6, 2024

మొక్కలను పంపిణీ చేసిన గంగుల

- Advertisement -
- Advertisement -

Trees distribute in karimnagar

కరీంనగర్: కరీంనగర్  జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్ వావిలాల పల్లిలోని దుర్గా మాతా ఆలయంలో బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి పూల పండ్ల మొక్కలను మంత్రి గంగుల, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, కాలనీవాసులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News