Saturday, April 27, 2024

త్రిషకు అరుదైన గౌరవం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ త్రిషకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రత్యేకమైన గోల్డెన్ వీసాను త్రిష అందుకుంది. యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో సినిమా రంగం అభివృద్ధి కోసం పలువురు సినీ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఈ గోల్డెన్ వీసా అందుకున్నవారికి సుదీర్ఘకాలం పాటూ యూఏఈలో నివసించే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే పలువురు భారతీయ సినీ ప్రముఖులకు గోల్డెన్ వీసాలను యూఏఈ ప్రభుత్వం అందించింది. ఈ క్రమంలో కోలీవుడ్ నుంచి త్రిషకు ఈ గోల్డెన్ వీసాను అందించింది. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘గోల్డెన్ వీసా అందకున్న తొలి తమిళ యాక్టర్‌గా ఎంతో సంతోషిస్తున్నాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను.. థాంక్ యూ’ అంటూ వీసా అందుకుంటోన్న ఫోటోను త్రిష పోస్ట్‌ చేసింది.

Trisha Received UAE’s Golden Visa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News