Saturday, April 27, 2024

క్షయ పరీక్షల ప్రచారంలో ట్రూనాట్‌ కీ రోల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు నుంచి మూడు వారాల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఈ వ్యాధి బారిన పడేందుకు అవకాశం ఉన్న ప్రజలతో పాటుగా ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వారిని పరీక్షించనున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ట్రూనాట్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఈ పరీక్షలను చేయడం కోసం ముందస్తు ఉపకరణంగా ఉపయోగించనున్నారు. ఈ ట్రూనాట్‌ సాంకేతికతను 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రపంచంలో మొట్టమొదటి పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ ర్యాపిడ్‌ మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్‌ వేదికగా టీబీ నిర్ధారణ, బహుళ ఔషదాల ప్రతిరోధక పరీక్షల కోసం గుర్తించింది.

ఈ కార్యక్రమం గురించి మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో శ్రీ శ్రీరామ్‌ నటరాజన్‌ మాట్లాడుతూ ‘‘భారతప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ టీబీ పరీక్ష కార్యక్రమంలో పాలుపంచుకుంటుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. లక్షణాలు కలిగిన వ్యక్తులతో పాటుగా ఈ వ్యాధిని తీసుకువెళ్లే ప్రతి ఒక్కరినీ పరీక్షించడం అత్యంత కీలకం. ఈ వ్యాధి నిర్మూలన కోణంలో ఇంటింటికీ పరీక్షలు చేయడం అత్యంత కీలకమైన ముందడుగు. ట్రూనాట్‌తో మార్పు తీసుకురాగలమని భావిస్తున్నాము’’అని అన్నారు

మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీటీఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయర్‌ మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో అతి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా క్షయ నిలుస్తోంది. ప్రపంచంలో నాలుగోవంతు క్షయ రోగులు ఇక్కడే ఉన్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా దీని నిర్మూలనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఇంటింటికీ పరీక్షలతో టీబీ నిర్మూలన దిశగా మరో ముందడుగు వేయనున్నాము. ఇప్పటికే దాదాపు 70% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో ఉండటంతో పాటుగా నాణ్యమైన నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. కానీ ట్రూ నాట్‌తో గ్రామీణ ప్రాంత వాసులు కూడా మెరుగైన సేవలను పొందగలరు’’ అని అన్నారు.

TrueNat Test to found Kshaya disease

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News