Monday, May 6, 2024

ఖాళీలపై ఐదు రోజుల్లోగా పూర్తి సమాచారం

- Advertisement -
- Advertisement -

ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై సమగ్ర సమాచారాన్ని 5రోజుల్లో అందించాలని అధికారులకు కేబినెట్ ఆదేశం
ఇచ్చిన సమాచారం అసమగ్రంగా ఉన్నందున అన్ని శాఖాల అధికారులకు తాజా ఆదేశాలు
ఆంధ్రాలో ఇంకా మిగిలి ఉన్న తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడానికి నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విభాగాల నుంచి ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది. కేబినెట్‌కు సమర్పించిన వివరాలు అసమగ్రంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అలాగే అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లా వారీగా విభాగాల వారీగా సంకలనం చేయాలని కేబినెట్ ఆదేశించింది. సిఎం కెసిఆర్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగులు, ఖాళీల ను ఖాళీల వివరాలను అందించారు. ప్రతి విభాగంలో మంజూరైన పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో వున్న ఖాళీల వివరాలతో పాటు అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను కూడా మంత్రివర్గం ముందుంచారు. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయ పడింది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెల్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను అధికారులను కేబినెట్ ఆదేశించింది.
మిగిలిన ఉద్యోగులనూ తీసుకొస్తాం
రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్ తెలిపింది. ఇంకా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రానుంచి తీసుకురాబోతున్నామన్నది. ఈ నేపథ్యంలో ఎపి నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకుని ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే గుర్తించి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందచేయాలని, మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.

TS Cabinet asks complete information on vacancies

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News